2nd వేవ్ దెబ్బకు మళ్లీ ఆర్థిక అనిశ్చితి -పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న నీతి ఆయోగ్ -విదేశీ వల్లే
కరోనా మహమ్మారి తొలి దశ వ్యాప్తిలో లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం, కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోవడం తెలిసిందే. తొలి వేవ్ కంటే ప్రమాదకరంగా ప్రస్తుత రెండో దశ వ్యాప్తిలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంలో గతేడాదిలా పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టనప్పటికీ, దాదాపు అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో మళ్లీ ఆర్థిక అనిశ్చితి తప్పదంటున్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరింత అనిశ్చితి తప్పదని, కరోనా వల్ల గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిన మాట వాస్తవమేనని అన్నారు.

నిజానికి కొవిడ్ను పూర్తిగా లేకుండా చేసే స్థితికి ఇండియా చేరుకున్న సమయంలో.. యూకే, ఇతర దేశాల వేరియంట్లు దేశంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తలకిందులై, విలయం మళ్లీ మొదలైందనన్నారు రాజీవ్ కుమార్. సెకండ్ వేవ్ సేవల రంగంలాంటి వాటిపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద ఎత్తున పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నదని చెప్పారు. మరి,
తొలి దశ లాక్ డౌన్ లో దెబ్బతిన్న రంగాలను ఆదుకోడానికి కేంద్రం ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన తీరుగా సెకండ్ వేవ్ లోనూ ఉద్దీపనలు ఉండొచ్చా? అనే ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర ఆర్థిక శాఖ అంచనాల తర్వాత తగిన సమయంలో ప్రభుత్వమే మరో ఉద్దీపన ప్యాకేజీపై స్పందిస్తుందని రాజీవ్ స్పష్టం చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ 2022, మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 11 శాతంగా ఉండొచ్చని నీతి ఆయోగ్ వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications