బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగుళూర్ చర్చి స్ట్రీట్ పేలుళ్లు: ముగ్గురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనుమానితులుగా అనుమానిస్తూ ముగ్గురిని కర్ణాటక రాజధాని బెంగళూర్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని పోర్ట్ టౌన్ భత్కల్‌లో వారిని పోలీసులు అరెస్టు చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, సాక్ష్యానికి అవసరమైన ఇతర సామగ్రి కూడా పోలీసులకు చిక్కింది.

3 Alleged Members of Indian Mujahideen Arrested by Bengaluru Police

పోలీసులు భత్కల్‌లోనూ బెంగళూరులోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీనియర్ ఇండియన్ ముజాహిదీన్ నేతల నుంచి ఈ ముగ్గురికి మెసేజ్‌లు వస్తున్నట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు.

అయితే, బెంగళూరు చర్చి స్ట్రీట్ పేలుళ్ల కేసులో మాత్రం ఏ మాత్రం ప్రగతి లేదు. ఈ కేసుకు సంబంధించిన ఏ విధమైన సంబంధాలను కూడా వారు గుర్తించలేకపోయారు. ఈ పేలుళ్ల ఘటనలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే.

3 Alleged Members of Indian Mujahideen Arrested by Bengaluru Police

తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించనున్నారు. భత్కల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

English summary
Three men suspected of being members of Indian Mujahideen or IM have been arrested by the Bengaluru police from Bhatkal, port town in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X