అలీగఢ్లో పేలుడు: ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు..
ఉత్తరప్రదేశ్ అలీఘడ్ బొమ్మల ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఖాటికన్ ఏరియాలో గల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలింది. పేలుడు తీవ్రతకు పైకప్పు ఊడి పడిపోయింది. ఆ సమయంలో కార్మికులు బొమ్మలను తయారు చేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. పది మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రి, మల్కాన్ సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పేలుడు జరిగిన వెంటనే సమీపంలో గల ప్రజలు బయటకు వచ్చారు. పేలుడు తీవ్రతతో ఐదు ఇల్లు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారికి స్థానికులు సాయం చేశారు. ఘటనాస్థలంలో ఏదైనా పేలుడు పదార్థం తయారీ జరుగుతోందా అనే అంశంపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ అభిషేక్ కుమార్ తెలిపారు. పేలుడు తీవ్రతతో ధ్వంసమయిన భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడుతో అలీగఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications