ఒకే ఫ్యామిలీలో ముగ్గురి హత్య: కప్బోర్డ్లో శవం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు హత్యకు గురయ్యారు. ఓ మృతదేహం కప్బోర్డులో కుక్కిపెట్టి ఉండటం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్ అనే వ్యక్తి భార్య జ్యోతి, కుమారుడు పవన్తో ఓల్డ్ రాజేంద్రనగర్లో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంజీవ్ ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన ఇంటి పనిమనిషి లోపలికి వెళ్లి చూసేసరికి యజమానురాలు, ఆమె కుమారుడు నిర్జీవంగా పడి ఉన్నారు.
తీవ్ర భయాందోళనలకు గురైన మనిషి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సంజీవ్ మృతదేహం కప్బోర్డులో లభ్యమైంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బంధువులే ఆస్తి కోసం ఈ హత్యలకు పాల్పడి ఉంటారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల ఘటనలో ఎంతమంది పాల్గొన్నారనే విషయం తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని జాయింట్ కమిషనర్ ఎస్ గౌతమ్ తెలిపారు.