వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఫ్యామిలీలో ముగ్గురి హత్య: కప్‌బోర్డ్‌లో శవం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు హత్యకు గురయ్యారు. ఓ మృతదేహం కప్‌బోర్డులో కుక్కిపెట్టి ఉండటం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్‌ అనే వ్యక్తి భార్య జ్యోతి, కుమారుడు పవన్‌తో ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంజీవ్‌ ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన ఇంటి పనిమనిషి లోపలికి వెళ్లి చూసేసరికి యజమానురాలు, ఆమె కుమారుడు నిర్జీవంగా పడి ఉన్నారు.

3 Of Family Murdered In West Delhi, 1 Body Found In Cupboard

తీవ్ర భయాందోళనలకు గురైన మనిషి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సంజీవ్‌ మృతదేహం కప్‌బోర్డులో లభ్యమైంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బంధువులే ఆస్తి కోసం ఈ హత్యలకు పాల్పడి ఉంటారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల ఘటనలో ఎంతమంది పాల్గొన్నారనే విషయం తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని జాయింట్ కమిషనర్ ఎస్ గౌతమ్ తెలిపారు.

English summary
Three members of a family were found allegedly murdered inside their home in west Delhi on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X