విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్: ముగ్గురికి ఉరి శిక్ష
కోల్ కతా: కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కోల్ కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా గుర్తించింది. ముగ్గురికి మరణ శిక్ష (ఉరి శిక్ష), మరో ముగ్గురికి జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ శనివారం తీర్పు చెప్పింది.
2013 జూన్ లో కామదుని ప్రాంతానికి చెందిన శిప్రా ఘెష్ (20) అనే కాలేజ్ యువతిని కిడ్నాప్ చేసిన నిందితులు కోల్ కతాకు 30 కిలో మీటర్ల దూరం తీసుకు వెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆమె గొంతు కోసి దారుణంగా హింసించి చంపేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 8 మందిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు నిర్దోషులు అంటూ ఇటీవల కోర్టు వారిని విడుదల చేసింది. ఆ ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్లే విడుదల చేశారని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్ బిమన్ బసు మండిపడ్డారు.
కేసు విచారణ పూర్తి కావడంతో ఆరు మంది దోషులు అని న్యాయస్థానం గుర్తించింది. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ శనివారం సంచలనమైన తీర్పు చెప్పింది. అయితే శిప్రా ఘెస్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications