గోరక్షణ పేరుతో కర్రలతో దాడులు, జై శ్రీరాం అనాలని బెదిరింపు : ఎంపీలో ఘటన, ఒకరి అరెస్ట్
భోపాల్ : ఎన్నికలు ముగిసాయ .. ఫలితాలు వచ్చాయి ... మళ్లీ గో రక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో గో రక్షకుల పేరుతో దాడికి తెగబడ్డారు కొందరు. తామే గో రక్షకులను స్వయంగా ప్రకటించుకొని ముగ్గురు ముస్లింలను చితక్కొట్టారు. అందులో ఒక మహిళ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కర్రలతో దాడి .. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాకు చెందిన ముగ్గురు తమ ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. అయితే వారు బీఫ్ తరలిస్తున్నారని గో రక్షకులకు తెలిసింది. వెంటనే ఆటోను ఆపారు. బీఫ్ సరఫరా చేస్తారా అని కర్రలతో దాడికి తెగబడ్డారు. వారి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టవడంతో వైరలైంది. అంతేకాదు వారిని జై శ్రీరాం అనాలని హుంకరించారు. వారు అందుకు స్పందించకపోవడంతో తమ కర్రలతో ప్రతాపం చూపియించారు. అక్కడున్న మహిళను జై శ్రీరాం అనాలని కర్రలతో బెదిరించారు.

ఒకరి అరెస్ట్ ..
మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని .. మిగతా వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 'మోదీని గెలిపించిన ఓటర్లు అమాయక ముస్లింలపై దాడికి ఇదే ఉదహరణ, మరోసారి తమ నైజాన్ని వారు ప్రదర్శించారు' అని మండిపడ్డారు.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications