35 మంది ఎయిమ్స్ వైద్యులకు కరోనా.. 24 గంటల్లో 1.31 లక్షల మందికి వైరస్
కరోనా కలవరం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ సంగతి చెప్పక్కర్లేదు. రాత్రిపూట కర్ఫ్యూ విధించిన పరిస్థితిలో మార్పు లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో పనిచేసే వైద్యులను కూడా కరోనా వదలడం లేదు. 35 మంది డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. అయితే అంతకుముందు సర్ గంగారం ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారికి వైరస్ సోకింది.
వీరిలో 32 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. వీరిలో కొందరికీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలో 7437 కరోనా కేసులు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక కరోనా కేసులు కావడం విశేషం. వైరస్ సోకిన 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11 వేల 157కి చేరింది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రోజు 8.1 శాతంగా ఉంది. అంతకుముందు అదీ 6.1గా ఉండేది.

ముంబైతోపాటు ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడ ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదు. మరోవైపు గురువారం వ్యాక్సిన్ అందజేసే అధికారికి కూడా కరోనా సోకడం కలకలం రేపింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ కేసులు 1.31 లక్షలు నమోదయ్యాయి.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications