భారత్ లో 37,154 కొత్త కేసులు, 724 మరణాలు : కరోనా రెండో దశ క్షీణిస్తున్నా కొత్త భయం !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం భారత్ తన రోజువారీ కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదు చేసింది . తాజాగా 37,154 కొత్త కేసులు నమోదు కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మరణాల లోను గణనీయమైన తగ్గుదల కనిపించింది.

గత 24 గంటల్లో 724 మరణాలు, మొత్తం మరణాలు 4,08,764

గత 24 గంటల్లో 724 మరణాలు, మొత్తం మరణాలు 4,08,764

గత 24 గంటల్లో 724 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,08,764 కు చేరుకుంది. గత 24 గంటల్లో 39,649 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,00,14,713 గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. క్రియాశీల కేసులు 4,50,899 కు చేరుకున్నాయి.యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.47 శాతంగా ఉన్నాయి.

 ఆదివారం కంటే స్వల్పంగా తగ్గిన రికవరీలు

ఆదివారం కంటే స్వల్పంగా తగ్గిన రికవరీలు

సోమవారం కోవిడ్ -19 కేసుల సంఖ్య ఆదివారం నమోదైన 41,506 కేసుల కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. నిన్న 895 మంది మరణాలు నమోదు కాగా, ఈరోజు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అయితే, గత 24 గంటల్లో నమోదైన మొత్తం రికవరీలు స్వల్పంగా తగ్గాయి, ఆదివారం 41,526 మంది కోలుకోగా, గత 24 గంటల్లో 39,649 మాత్రమే కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లోని పర్యాటక ప్రాంతాలలో పర్యాటకుల కారణంగా ఆందోళన నెలకొంది.

 లాక్ డౌన్ సడలింపులతో పర్యాటక ప్రాంతాల్లో ఆందోళన

లాక్ డౌన్ సడలింపులతో పర్యాటక ప్రాంతాల్లో ఆందోళన

వీరిలో ఎక్కువ మంది మాస్కులు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరగడం ఆందోళనకరంగా మారింది. కోవిడ్ -19 యొక్క మూడవ వేవ్ యొక్క భయం ఇప్పటికే భారత్లో వ్యక్తమవుతున్న సమయంలో ప్రజల నిర్లక్ష్య వైఖరి కలిగిస్తుంది . కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రధాన కార్యదర్శులు మరియు ఎనిమిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

ఇంకా కరోనా పాజిటివిటీ రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇంకా కరోనా పాజిటివిటీ రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం శాఖ సమావేశం తరువాత, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో, కోవిడ్ -19 రెండవ వేవ్ యొక్క క్షీణత వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో (యుటి) వివిధ దశలలో ఉన్నప్పటికీ, కేసు సానుకూలత రేటు రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ జిల్లాలు "10 శాతానికి పైగా ఉన్నాయని, ఇది ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.

హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల సందడి .. కరోనా జాగ్రత్తలు పాటించాలని సీఎం విజ్ఞప్తి

హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల సందడి .. కరోనా జాగ్రత్తలు పాటించాలని సీఎం విజ్ఞప్తి

ఇదిలావుండగా, కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఇటీవల రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. "రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గురించి మేము ఆందోళన చెందుతున్నామని ఆయన పేర్కొన్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా కులు మనాలి చుట్టూ తిరిగే ప్రయాణికుల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల స్వీయనియంత్రణ పాటించాలని, పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+