వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. టాటానగర్ - జమ్మూ మురి ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 2 గంటల ప్రాంతంలో సిరతు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం అలహాబాదుకు సమీపంలో ఉంటుంది. రైలు చాలా మెల్లగా నడుస్తోందని, ప్రమాదంలో బోగీలకు ఏ విధమైన నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.

 4 Feared Dead as Train Derails in Kaushambi, Uttar Pradesh

రైలు పట్టాలు తప్పడంతో ఓ బోగీ పూర్తి దెబ్బ తిన్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎ1, బి1, బి2, ఐదు స్లీపర్ కోచ్‌లు, ఓ జనరల్ కోచ్ పట్టాలు తప్పాయి. జనరల్ కోచ్ తీవ్రంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.

స్థానికులు, ఇరుగుపొరుగు గ్రామాలవాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. అలహాబాద్ నుంచి సహాయ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు కదిలింది.

English summary
Four people are feared dead after Tata Nagar-Jammu Muri Express derailed in Uttar Pradesh's Kaushambi district. The incident happened at around 2 pm near Sirathu railway station, which is close to Allahabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X