Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాత నోట్లుంటే నాలుగేళ్ల జైలుశిక్ష: కొత్త ఆర్డినెన్సుకు ఆమోదం, మార్చి 31 నుంచి అమలు

పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

న్యూఢిల్లీ: పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్డినెన్సు ప్రకారం.. 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉన్న వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.

అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది.

4-year jail for possession of old notes: Ordinance on demonetisation gets Cabinet nod, Implementation From March 31st

ఈ కొత్త ఆర్డినెన్సుకు ' ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పీరు పెట్టారు. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది.

నిజానికి రిజర్వు బ్యాంకు చట్టాన్ని సవరించాలని కేంద్రం తొలుత భావించింది. అయితే గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే వీలు లేకపోవడంతో కేంద్రం ఈ ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా పాత నోట్ల డిపాజిట్ కు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+