నాలుగు రోజులు-40 గంటలు: రాహుల్ను విచారించిన ఈడీ, 21న కూడా రావాలని సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నాలుగో రోజు కూడా విచారించిన అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సైతం ఈడీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. సోమవారం సైతం రాహుల్ను ఈడీ ప్రశ్నించింది.
రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. సోమవారం విచారణకు నాలుగో రోజు కాగా.. ఇప్పటివరకు 38 గంటల పాటు రాహుల్ను ఈడీ విచారించింది. కాగా, ఆదివారం రాహుల్ గాంధీ 52వ పుట్టినరోజు కాగా.. ఆ తర్వాతి రోజే ఈడీ ముందు హాజరయ్యారు. జూన్ 17న ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. రెండ్రోజులు విరామం ఇవ్వాలని అధికారులను కోరారు.

తన తల్లి సోనియా గాంధీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో విరామం కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో రాహుల్ను సోమవారం రావాలని ఈడీ పేర్కొంది. ఈ ప్రకారం.. సోమవారం ఉదయం 11.05 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారు.
గతవారం తరహాలోనే ఈడీ ఆఫీస్ పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసులను, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు భోజన విరామం తీసుకున్న రాహుల్.. 4.45 గంటలకు మళ్లీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. సోమవారం విచారణ అనంతరం మంగళవారం కూడా హాజరుకావాలని ఈడీ అధికారులు రాహుల్ గాంధీని కోరారు.
కాగా, ఇప్పటివరకు నాలుగు రోజులు రాహుల్ను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో సోనియా గాంధీకి సైతం నోటీసులు పంపారు. జూన్ 23న హాజరు కావాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఈడీ విచారణపై నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేతలు జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేశారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఆమె జూన్ 23న ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications