Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కల్లోలం: 42మంది సిబ్బందికి కరోనా; ఎన్నికల సమావేశాలపై ఎఫెక్ట్!!

దేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. ఇక రాజకీయ పార్టీల నాయకులకు కరోనా టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పుడు ఐదు ప్రధాన రాష్ట్రాలలో ఎన్నికల సమయం కావటంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. తాజాగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యాలయంలోని 42 మంది సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఇది బీజేపీకి పెద్ద ఇబ్బందిగా మారింది.

Recommended Video

    Omicron Variant : Omicron Can Be Detected With An RT-PCR Test ? || Oneindia Telugu
    ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ వరుస సమావేశాలు .. ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా

    ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ వరుస సమావేశాలు .. ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా

    కోవిడ్-19 కోసం పాజిటివ్ నిర్ధారణ అయిన 42 మంది న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయ సభ్యులలో భద్రతా అధికారులు మరియు పార్టీ సిబ్బంది ఉన్నారు.
    యుపి మరియు ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఈ నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతరులు సహా బిజెపి సీనియర్ నాయకులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో కార్యాలయంలో పనిచేస్తున్న భద్రత అధికారులకు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం బీజేపీకి తలనొప్పిగా మారింది

    బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కల్లోలం .. నేతలలో భయం

    బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కల్లోలం .. నేతలలో భయం

    సోమవారం, బిజెపి ప్రధాన కార్యాలయంలో సామూహిక కోవిడ్ -19 టెస్ట్ డ్రైవ్ నిర్వహించబడింది. ఆ తర్వాత 42 మంది సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌ బారిన పడినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వీరందరూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించబడిందని మరియు సిబ్బందితో పరిచయం ఉన్న వ్యక్తులను ట్రాక్ చేస్తున్నారని కూడా సమాచారం. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయానికి సమావేశాల నిమిత్తం వెళ్లి వచ్చిన వారికి కరోనా భయం పట్టుకుంది.

    రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీలకు కోవిడ్ పాజిటివ్

    రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీలకు కోవిడ్ పాజిటివ్

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిజెపి చీఫ్ జెపి నడ్డా మరియు ఇతరులతో సహా బిజెపి సీనియర్ నాయకులు ఇప్పటికే కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షించారు. ప్రస్తుతం వీరంతా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. కరుణ మహమ్మారి సోకిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ కాను తేలికపాటి లక్షణాలతో కోవిడ్ 19కి పాజిటివ్ పరీక్షించానని,హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని తనను సంప్రదించిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానని , గడ్కరీ అని మంగళవారం ట్వీట్‌లో పేర్కొన్నారు.

    బీజేపీ ఎన్నికల సమావేశాలపై కరోనా ప్రభావం .. ఇబ్బంది పడుతున్న బీజేపీ నేతలు

    బీజేపీ ఎన్నికల సమావేశాలపై కరోనా ప్రభావం .. ఇబ్బంది పడుతున్న బీజేపీ నేతలు

    బిజెపి ప్రధాన కార్యాలయంలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరగడం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పార్టీ వ్యూహ సమావేశాలను కూడా ప్రభావితం చేయవచ్చునని తెలుస్తుంది. గత వారం, భారత ఎన్నికల సంఘం (ECI) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా మరియు పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 10 మరియు మార్చి 7 మధ్య జరుగుతాయి.

    ఫలితాలు మార్చి 10 న ప్రకటించబడతాయి. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు బిజెపికి కీలకంగా మారిన సమయంలో బిజెపి ప్రధాన కార్యాలయంలో పనిచేసే నేతలు, భద్రతా సిబ్బంది, కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్య నాయకులు కరోనా మహమ్మారి బారిన పడుతుండటం భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామంగా కనిపిస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+