టేకాఫ్ అవుతుండగా.. జెట్ బ్లాస్ట్, ఇండిగో ఫ్లైట్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు టేకాఫ్ కు సిద్ధమవుతున్న ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు టేకాఫ్ కు సిద్ధమవుతున్న ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
పార్కింగ్ బేలోకి వచ్చిన స్పైస్ జెట్ విమానం హఠాత్తుగా జెట్ బ్లాస్ట్ అవడంతో ఆ ధాటికి ఇండిగో విమానం ముందరి కుడివైపు అద్దం పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇండిగో విమాన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన ప్రయాణికులకు వెంటనే చికిత్స నిమిత్తం ఎయిర్ పోర్టులోని క్లినిక్ కు తరలించినట్లు ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
శుక్రవారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఇండిగో కోచ్ నెంబర్ 34.. ఈబే 17లో బోర్డింగ్ ప్రయాణికులతో సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే సమయంలో స్పైస్ జెట్ ఎస్ జీ-253 విమానం దానికి కేటాయించిన బేలో పార్కింగ్ చేసుకునేందుకు టర్న్ అవుతోందని, ఆ సమయంలో ఒక్కసారిగా జెట్ బ్లాస్ట్ అవడంతో ఆ ప్రభావానికి సమీపంలోనే ఉన్న ఇండిగో విమానం ముందరి కుడివైపు అద్దం పగిలిపోయిందని తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై స్పైస్ జెట్ ఇంకా స్పందించలేదు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications