పుల్వామాలో మళ్లీ కాల్పుల మోత -భీకర ఎన్కౌంటర్లు -ఐదుగురు ఉగ్రవాదులు హతం -జవాన్లకూ గాయాలు
పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలకు చెందిన నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్ కల్చర్పై జో బైడెన్ సంచలన అడుగు
పుల్వామా జిల్లాలోని అవంతిపొర సమీప ప్రాంతాల్లో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు ఉమ్మడిగా గాలింపు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి గాలింపు కొనసాగుతుండగా, శుక్రవారం ఉదయం టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాల ఎదురు కాల్పులు జరిపారు.
అవంతిపొర ఎన్ కౌంటర్ లో గుర్తుతెలియని ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు. ఇంకా దాక్కొని ఉన్న ఉగ్రవాదుల కోసం భద్రదళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పారు. మరోవైపు
లదాక్లో ఇంకా చైనా కదలికలు -సైన్యం పూర్తి ఉపసంహరణకు భారత్ పట్టు -నేడు 11వ రౌండ్ చర్చలు
షోపియాన్ జిల్లాలో కూడా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గురువారం రాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. షోపియాన్ పట్టణంలో ఓ మసీదులో నక్కిన టెర్రరిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా సెక్యూరిటీ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు ఘటనల్లోనూ భద్రతా సిబ్బంది నలుగురికి గాయాలయ్యాయి.