ఢిల్లీలో అగ్నిప్రమాదం : 50 మందిని రక్షించిన సిబ్బంది
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే పార్లమెంట్ స్ట్రీట్లో ఓ స్టోర్లో మంటలు అంటున్నారు. ఇక్కడ ప్రముఖులు ఉండటంతో హైటెన్షన్ నెలకొంది.
షార్ట్ సర్క్యూటేనా ?
ఇక్కడ సంసాద్ మార్గ్ లో గల జీనవ్ దీపు భవన సముదాయంలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగ కమ్ముకొవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటన ఏడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. భవనంలో ఉన్న దాదాపు 50 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.

ప్రమాదంలో ఇప్పటివరకు చనిపోలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. జీవన్ దీపు నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయని .. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఇప్పటివరకు ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications