నెలరోజుల్లోనే 51% కరోనా కేసుల పెరుగుదల: తాజా పరిస్థితి చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!!
మళ్లీ భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3000 దాటింది. గణాంకాల ప్రకారం 423 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3420 కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలలో మళ్ళీ కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేవలం నెలరోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 52 శాతానికి పెరిగిందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్ 1 వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. నెల రోజుల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, నెలరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. 3 వేల మందికి పైగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా, 70 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనాను కట్టడి చెయ్యకుంటే కేసులు బాగా పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ తో పెద్దగా జనాలకు ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తలు వహించాలని సూచించింది.
బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, మళ్లీ కరోనా నిబంధనలు అందరూ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అభివర్ణించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications