కంపించిన శ్రీనగర్-ఢిల్లీ: పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో 6.1 తీవ్రతతో భూమి తీవ్రంగా కంపించింది. ఆ ప్రభావం ఉత్తర భారతదేశంపైనా పడింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు దాదాపు 40 సెకన్లపాటు కొనసాగినట్లు సమాచారం.
భూమి కంపించడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు నివాసాలను వదిలి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల 7.9 తీవ్రతతో నేపాల్ సంభవించిన భూ ప్రకంపనల ప్రభావం ఉత్తర భారతదేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్, ఇతర పలు రాష్ట్రాలపై పడింది. ఇది ఇలా ఉండగా, 6.6 తీవ్రతతో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, పెషావర్ ప్రాంతాలు కంపించాయి.

లోయలో పడిన లారీ: ఏడుగురి మృతి
లారీ లోయలో పడి ఏడుగురు మృత్యువాతపడిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తురైవూర్ ప్రాంతానికి చెందిన కొంతమంది లారీలో వెళుతుండగా.. ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టరు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications