వాయుసేన స్థావరాలపై భారీ దాడికి లష్కరే కుట్ర.. హై అలర్ట్ ప్రకటన!
ఉత్తరప్రదేశ్లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యూపీలోని భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది.
ఆరు నుంచి ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు వాయిసేన స్థావరాలను, ముఖ్యంగా ఘజియాబాద్లోని హిండన్ వద్దనున్న ఐఎఎఫ్ స్థావరంపై దాడికి కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' (ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ వింగ్) ఓ నివేదికలో హెచ్చరించింది.

బుధవారం ఉదయం ఘజియాబాద్లోని వాయిసేన హిండన్ బేస్ గోడను దాటేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకూ, ఇంటెలిజెన్స్ నివేదికకూ సంబంధం ఎదైనా ఉందా? అనేది ఇంకా తెలియలేదు.
లష్కరే ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్ లాంఛర్లు, హ్యాండ్ గ్రనేడ్లతో దాడులు జరపవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. కాగా, 'రా' ఇచ్చిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications