వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఆరుగురు మృతి, 12 మందికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

6 dead, over 12 injured in boiler explosion in factory in Muzaffarpur, Bihar.

ఈ ఫ్యాక్టరీ ముజఫర్పూర్ లోని బేలా ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం కూడా తెలియరాలేదు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది.

ఈ శబ్ధం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్తానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేశారు.

English summary
6 dead, over 12 injured in boiler explosion in factory in Muzaffarpur, Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X