Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసోంలో బాంబు పేలుడు, ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

గువాహతి : అసోంలో తీవ్రవాదులు బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం గువాహితిలో జూ రోడ్డులో గల షాపింగ్ మాల్ వద్ద బాంబు పేల్చారు. దీంతో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

6 injured in grenade blast near Guwahati mall

ఇద్దరి పరిస్థితి విషమం ...
పేలుడులో ఆరుగురు గాయపడగా .. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తరలించారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది తామేనని ఉల్ఫా తీవ్రవాద సంస్థ పేర్కొంది. ఉల్ఫా-1 తీవ్రవాద సంస్థకు పరేశ్ బర్షా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. ఈ పేలుడు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అసోం సీఎం శర్బానంద సోనోవాల్ డీజీపీని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+