పెను విషాదం: ఫ్రిడ్జ్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ (Jalandhar) జిల్లాలో పెను ప్రమాదం ఏకంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటిల్లిపాది ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశ్ పాల్ గాయ్(70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్(40), వారి 14 ఏళ్లలోపు వయస్సున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.

ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ను ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించారు. పేలుడుకు గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలికి చేరుకుని నమూనాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటంబంలో ఆరుగురు మృతి చెందడంతో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. అయితే, ఫ్రిడ్జ్ పేలి ఆరుగురు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రిడ్జ్ ఇంత ప్రమాకరమా? అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications