పెను విషాదం: ఫ్రిడ్జ్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ (Jalandhar) జిల్లాలో పెను ప్రమాదం ఏకంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటిల్లిపాది ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశ్ పాల్ గాయ్(70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్(40), వారి 14 ఏళ్లలోపు వయస్సున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.

ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ను ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించారు. పేలుడుకు గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలికి చేరుకుని నమూనాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటంబంలో ఆరుగురు మృతి చెందడంతో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. అయితే, ఫ్రిడ్జ్ పేలి ఆరుగురు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రిడ్జ్ ఇంత ప్రమాకరమా? అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications