అయిదవ విడతలో 62.5 శాతం పోలీంగ్
అయిదవ విడతలో పోలింగ్ లో 62.5 శాతం ఒటింగ్ నమోదైంది. కాగా కశ్మీర్ మరియు బెంగాల్ లో చెలరేగిన ఘర్షణల్లో బీజేపీ అభ్యర్థితోపాటు ఇద్దరు గాయపడగా మొత్తం 51 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో ఉత్తర్ ప్రదేశ్లో 14 స్థానాలకు, రాజస్థాన్లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 7లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్లో 5 స్థానాలకు జార్ఖండ్లో 4 స్థానాలకు పోలింగ్ జరిగింది.
రెండు చోట్ల ఘర్షణలు
అయిదవ విడత ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి, యూపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధి తోపాటు యూనియన్ మినిస్టర్ రాజ్నాధ్ సింగ్ మరియు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లు పోటిపడ్డారు. కాగా మిగిలిన 118 స్థానాలకు గాను మే 12 , 19 న జరగనుంది. హుగ్లీ బీజేపీ నేత ఛటర్జీపై రాళ్లదాడి జరగడంతో ఆయన కలెక్టర్ కార్యాలయం మందు ఆందోళన చేశారు. మరోవైపు కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గ్రెనేడ్ ను విసిరిన సంఘటనలు జరిగాయి.
పోలింగ్ హైలట్స్...
కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు నాలుగోసారి రంగంలోకి దిగగా అక్కడ బీజేపి అభ్యర్థి స్మృతి ఇరాణి గట్టిపోటినిచ్చారు.కాగా యూపిలో లో జరిగిన 14 స్థానాల్లో 2014 లో బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రాహుల్ గాంధీ పోటి చేసిన అమేఠీతోపాటు సోనియా గాంధి పోటిచేసిన రాయ్బరేలి స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. కాగా యూపిలో 14 సీట్లలో బీఎస్పీ 5 స్థానాల్లో పోటి చేయగా, ఎస్పి 7 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటిలోకి దింపింది.
పుల్వామా జిల్లాలో ఎన్నికలు
ఫిబ్రవరీ ఉగ్రవాదుల దాడికి 40 మంది సైనికుల ప్రాణాలను కోల్పోయిన ప్రాంతమైన పుల్వామా జిల్లాలో నేడు ఎన్నికలు జరిగాయి.అయితే అక్కడ గ్రెనేడ్ దాడి జరిగింది. కాగా గ్రెనేడు దాడిలో ఎలాంటీ ప్రమాదం సంభవించలేదు. కాగా జార్ఘండ్ లోని నాలుగు మావోయిస్ట్ ప్రభావిత నియోజకవర్గాలైన హజారీబాగ్, కొడెర్మా ,రాంచీ మరియు కుంతి నియోజవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.