ఇండియాలో 34 లక్షలకు పైగా కరోనా కేసులు.. ఒకేరోజులో 76,472 కొత్త కేసులు, 1,021 మరణాలు
భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది .తాజాగా 30 లక్షలకు కేసులు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరుతో పాటు ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న వైద్య సిబ్బందిలోనూ కరోనా కేసులు పెరగటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video
ఇండియాలో గత 24 గంటల్లో 76,472 కొత్త కేసులు, 1,021 మరణాలు
గత 24 గంటల్లో భారత్ లో 76,472 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,021 కరోనా మరణాలు నమోదు అయ్యాయి . కొత్త కేసుల పెరుగుదలతో భారతదేశ కరోనావైరస్ సంఖ్య 34 లక్షలకు పైగా చేరుకుంది. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 34,63,973 గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం తెలిపింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 62,550 కు చేరుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో 7,52,424 యాక్టివ్ కేసులు ఉండగా, 26,48,999 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.
కేసుల పెరుగుదలతో పూర్తిగా అన్ లాక్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాల సంశయం
రికవరీ రేటు గత 76.49 శాతానికి పెరిగింది. భారతదేశంలో మరణాల రేటు 1.82 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, కొన్ని రాష్ట్రాలు జిమ్లను, స్కూల్స్ ను, షాపింగ్ మాల్స్ ను తిరిగి తెరవడానికి సంశయంలో ఉన్నాయి. కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మధ్య ఈ సంవత్సరం నీట్ మరియు జెఇఇ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది, విద్యార్థుల భద్రతపై ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ పొడిగించిన జార్ఖండ్ సర్కార్
ఇక
కరోనా
వైరస్
కేసులు
ప్రతి
రోజు
రికార్డు
స్థాయిలో
కేసులు
పెరుగుతూనే
వున్న
నేపధ్యంలో
లాక్
డౌన్
పొడిగించాలని
జార్ఖండ్
సర్కార్
నిర్ణయం
తీసుకుంది.సెప్టెంబర్
30
వరకు
లాక్డౌన్
పొడిగించాలని
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకుంది.
ఈ
విషయాన్ని
సీఎం
హేమంత్
సోరెన్
ప్రకటించారు.
ప్రజలంతా
లాక్డౌన్
నియమాలను
పాటించాలని,
మాస్కులు
ధరించాలని
హేమంత్
సోరెన్
ప్రజలకు
విజ్ఞప్తి
చేశారు
జార్ఖండ్
లో
ఇప్పటివరకు
34
వేలకు
పైగా
కేసులు
నమోదవగా...
378
మంది
కరోనా
కు
బలి
అయ్యారు.
ఇండియాలో టాప్ త్రీ రాష్ట్రాల్లో కేసుల పరిస్థితి ఇదే !!
ఇక
కరోనా
కేసులలో
టాప్
గా
ఉన్న
మహారాష్ట్రలో
బీభత్సంగా
కేసులు
నమోదు
అవుతూనే
ఉన్నాయి.
ఇప్పటివరకు
మహారాష్ట్ర
లో
మొత్తం
7,47,995
కరోనా
కేసులు
నమోదవగా
,1,80,718
కేసులు
యాక్టివ్
గా
ఉన్నాయి.
కరోనా
నుండి
కోలుకున్న
వారు
5,43,170
కాగా
23,775
మంది
కరోనాతో
మృతి
చెందారు
.
తమిళనాడు
రెండో
స్థానంలో,
ఆంధ్ర
ప్రదేశ్
మూడో
స్థానంలో
కొనసాగుతున్నాయి
.
తమిళ
నాడులో
ఇప్పటివరకు
4,09,238
కరోనా
కేసులు
నమోదు
కాగా
,
52,506
కేసులు
యాక్టివ్
గా
ఉన్నాయి
.3,49,682
మంది
డిశ్చార్జ్
అయ్యారు.
7,050
మంది
మృతి
చెందారు
.
ఆంధ్ర
ప్రదేశ్
రాష్ట్రంలో
4,03,616
మొత్తం
కేసులు
ఉన్నాయి.
96,191
కేసులు
యాక్టివ్
గా
ఉన్నాయి.
ఇప్పటి
వరకు
3,03,711
మంది
కోలుకుని
డిశ్చార్జ్
అయ్యారు.
3,714
మంది
మృతి
చెందారు
.