8మంది సిమి ఉగ్రవాదుల హతం: ఇలా దొరికిపోయారు(పిక్చర్స్)
భోపాల్: ఆదివారం అర్ధరాత్రి రాత్రి రెండు గంటల సమయంలో జైల్ గార్డ్ రామ్ కుమార్ను దారుణంగా హత్య చేసి పారిపోయిన 8మంది సిమీ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా.. ఈ 8మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు.
గార్డు హత్య: జైలు నుంచి పరారైనగంటల్లోనే 8మంది ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం

అర్ధరాత్రి గార్డును చంపి..
ఆదివారం అర్ధరాత్రి రాత్రి రెండు గంటల సమయంలో జైల్ గార్డ్ రామ్ కుమార్ను దారుణంగా హత్య చేసి పారిపోయిన 8మంది సిమీ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారు.

వేట మొదలు
ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా.. ఈ 8మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు.

8గంటల్లోనే..
పారిపోయిన తర్వాత అందరూ విడిపోకుండా.. ఒకే గ్రూప్గా కలసి వుండటంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే వారు దొరికిపోయారు. రాత్రి 2 గంటలకు జైలు నుంచి పారిపోయిన వారిని ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు.

లొంగిపోవాలన్నా..
భోపాల్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఐంతకేడీ గ్రామ సమీపంలో వీరిని గుర్తించారు. తమకు లొంగిపోవలసిందిగా పోలీసులు వారిని కోరినప్పటికీ.. వారు వినిపించుకోలేదు.

హతమయ్యారు
పోలీసులపై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు కాల్పులు జరపక తప్పలేదదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ పోలీసు అధికారి వివరించారు.

హైలర్ట్
గార్డును చంపి భోపాల్ జైలు నుంచి 8మంది ఉగ్రవాదులు పరారైన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్కౌంటర్పై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకొని పారిపోడం ఒక తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదుల జాడ కనిపెట్టి పోలీసులు ఉగ్రవాదులను మట్టుబెట్టారని ఆయన తెలిపారు.

సిమీ ఉగ్రవాదుల ఆచూకీని స్థానికులే తెలిపారు
జైలు నుంచి తప్పించుకుని ఎన్కౌంటర్లో హతమైన వారిలో అహ్మదాబాద్కు చెందిన ముజీబ్ షేక్, మధ్యప్రదేశ్కు చెందిన అబ్దుల్ మజీద్, షోలాపూర్ కు చెందిన మహ్మద్ ఖాలీద్ అహ్మద్, మహ్మద్ సాలిక్ అలియాస్ సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు తప్పించుకున్నారని మధ్యప్రదేశ్ ఐజీ యోగేష్ చౌదరి ఉన్నారు.

సస్పెండ్ చేశారు
కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 8మంది ఉగ్రవాదుల పరారీకి కారణమైన ఐదుగురు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉగ్రవాదులు బయటికి వచ్చేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications