బాలిక మీద లైంగికదాడి: కామాంధుడికి దేహశుద్ది
బెంగళూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను పిలుచుకుని వెళ్లి లైంగిక దౌర్జన్యం చేసిన కామాంధుడిని బెంగళూరు నగర శివర్లాలోని చిక్కజాల పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రశాంత్ కుమార్ (23) అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు.
ఇతను బెంగళూరు చేరుకుని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని తరబనహళ్ళిలో నివాసం ఉంటున్నాడు. ఇతు బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని రిసార్ట్స్ లో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి తరబనహళ్ళిలో 8 సంవత్సరాల బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఆ సమయంలో అటువైపు వెళ్లిన కామాంధుడు బాలికతో మాట్లాడాడు. మీ నాన్న దగ్గర వదిలిపెడుతానని చెప్పి బాలికను నిర్జన ప్రదేశంలోని పోదల దగ్గరకు తీసుకు వెళ్లాడు. తరువాత బాలిక మీద లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో అటు వైపు కొందరు వెళ్లారు.
విషయం గుర్తించిన ప్రశాంత్ కుమార్ అక్కడి నుండి తప్పించుకొవడానికి ప్రయత్నించాడు. ప్రశాంత్ కుమార్ ప్రవర్థన మీద అనుమానం రావడంతో స్థానికులు పోదల దగ్గర చూశారు. బాలిక దుస్తులు లేకుండా ఉన్న విషయం గుర్తించారు. అదే సమయంలో కామాంధుడు కాలికి బుద్ది చెప్పాడు.
స్థానికులు వెంటాడి కామాంధుడిని పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. ఒక నెల క్రితం ప్రశాంత్ బెంగళూరు చేరుకుని రిసార్ట్స్ లో పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించామని, నిందితుడిని ఫోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు.