వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: వృద్ధ తల్లిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశాడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

తల్లిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసేసాడు, వీడియో

జైపూర్‌: అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేస్తే.. ఓ కొడుకు తన తల్లిని వృద్ధాప్యంలో చిత్రహింసలకు గురిచేసి చివరకు ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి(82) తన కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది.

 82-year-old woman dies after being thrashed by son in Alwar

వయో భారం, కొద్ది రోజుల క్రితం పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తరచూ తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది.

కాగా, ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు అతని తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. జనవరి 18న తీసిన ఆ వీడియో వైరల్‌ అయి చివరకు ఫిబ్రవరి 2న ఈ విషయం పోలీసులకు చేరింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జోగేంద్ర ఇంట్లో లేడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

English summary
A chilling video of a son beating and torturing her 82-year-old paralytic mother in a village under the limits of Shahjahanpur police station in Alwar went viral on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X