షాక్: టీచర్పై అసభ్యరాతలు, 88 మంది విద్యార్థినిల బట్టలిప్పారు
ఇటానగర్: క్రమశిక్షణ పేరుతో ఓ స్కూల్లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేసే శిక్షల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే తమ తప్పును తెలుసుకొని భవిష్యత్తులో ఆ తరహ తప్పులు చేయకుండా విద్యార్థులకు తెలిసేలా చేయడం శిక్షల ఉద్దేశ్యంగా ఉండాలి. కానీ, శిక్షల పేరుతో విద్యార్ధులను హింసించడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

టీచర్పై విద్యార్థుఅ అసభ్యరాతలు
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్లో క్లాస్ టీచర్పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. అయితే విద్యార్థులు క్లాస్ టీచర్పై అసభ్యరాతలు రాసిన ఘటనపై టీచర్లు విద్యార్థులకు దారుణమైన శిక్షను అమలు చేశారు. టీచర్పై రాసిన అసభ్యరాతలకు సంబంధించిన కాగితం ముక్క పూర్తిగా దొరకలేదు. సగభాగం మాత్రమే విద్యార్థులకు అందింది. మిగిలిన సగభాగం కోసం విద్యార్థులపై కఠినంగా శిక్షను అమలు చేశారు ముగ్గురు టీచర్లు.

88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టారు
క్లాస్ టీచర్పై అసభ్య రాతలు రాసిన కాగితం ముక్క కోసం 88 మంది విద్యార్థినులను తోటి విద్యార్థినుల ముందే బట్టలిప్పించారు. ఆరు, ఏడు తరగతులకు చెందిన విద్యార్థినుల బట్టలను విప్పి నిలబెట్టారు.విద్యార్థుల బట్టలు విప్పి కాగితం ముక్క కోసం వెతికారు.కాగితం ముక్క కోసం వెతికారు. కానీ, కాగితం ముక్క దొరకలేదు. కాగితం ముక్క కోసం విద్యార్థులను అలాగే నగ్నంగా నిలబెట్టారు.

ముగ్గురు టీచర్లు విద్యార్థినులను శిక్షించారు
క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాశారు. ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారు. అయితే విద్యార్థినులను శిక్షించే ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ కీలకంగా వ్యవహరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని టీచర్లు విద్యార్థులను హెచ్చరించారు.

పోలీసులకు ఫిర్యాదు
వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వాస్తవమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దారుణమని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications