వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాంచీపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు.

వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వ్యాన్‌లో 16 మంది కంటే మించి ప్రయాణం చేయకూడదు. అయితే 25 మందిని వ్యాన్‌లో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

 9 killed, 8 injured in Kanchipuram road accident
కాంచీపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీని వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. వ్యాన్ డ్రైవర్ కూడ చనిపోయినట్టు సమాచారం.

ఈ వ్యాన్‌లో ప్రయాణీస్తున్న మరో 16 మంది ప్రయాణీకులు కూడ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాంచీపురం కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

English summary
Nine persons including seven woman were killed, eight of them on the spot, and eight others were injured when a mini van in which they were travelling hit by a private company bus, near Thamal in the National Highway at Kanchipuram district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X