వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. గురువారం ఉదయం ముంబై గోవా హైవేపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5 పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో నాగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా.. చిన్నారిని మంగాన్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం గోవా, ముంబై హైపై రాయ్ ఘడ్ జిల్లాలోని రేపోలి వద్ద జరిగింది.

ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లారీ ముంబై వెళ్తుండగా.. కారు రత్నరిగి జిల్లాలోలని గుహర్ వైపు వెళ్తుంది. ఘటన స్థలిలో కారు నుజ్జునుజ్జు అయింది.లారీ ముందు భాగం దెబ్బంది. దృశ్యాలు రోడ్డు ప్రమాదాన్ని కళ్లకు కట్టాయి. ఈ ప్రమాదంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 9 members has killed including child in road accident in Maharastra

పది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ట్రక్, బస్సు ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులతో సాహా 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన లగ్జరీ బస్సు అంబర్ నాథ్ నుంచి షిరిడి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ బస్సులో
లక్ష్మీనారాయణ ప్రింట్‌ అండ్‌ ప్యాక్‌ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ట్రక్ డ్రైవర్, సఖారామ్ పల్హాల్ ఔరంగాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.

English summary
A terrible road accident took place in Maharashtra. 9 people including a child died in this accident. A car and a lorry collided on the Mumbai-Goa highway on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X