షాక్: తన చితికి తానే నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య
ముంబై: ఎంతో మనోవేదనకు గురై జీవితంపై విరక్తిచెందిన ఓ వృద్ధురాలు తన చితిని తానే పేర్చుకుంది. ఆ తర్వాత నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. కొల్హాపూర్ జిల్లాకి చెందిన కళవ్వ(90) అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి ఉంటోంది. మంగళవారం రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. గదిలో కట్టెలతో చితిని పేర్చి దానిపై కూర్చుంది. ఒంటినిండా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

బుధవారం ఉదయం కళవ్వ మనవరాలు ఎంత తలుపుకొట్టినా ఆమె తెరవకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని తండ్రి విఠల్కి చెప్పింది. విఠల్ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి దహనమై తన తల్లి శరీరాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవితంపై విరక్తి కలగడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications