బెంగళూరులో 34 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్: షాక్ తో కోమాలోకి, ఎంత దారుణం అంటే !
బెంగళూరు నగరంలో కీచకులు రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతులు, చిన్నారు, వృద్దులు అనే తేడా లేకుండా కామాంధుల్లా విరుచుకుపడుతున్నారు. బెంగళూరు నగరంలో ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకోంది. మహిళ మీద సామూహిక అత్య
బెంగళూరు: బెంగళూరు నగరంలో కీచకులు రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతులు, చిన్నారు, వృద్దులు అనే తేడా లేకుండా కామాంధుల్లా విరుచుకుపడుతున్నారు. బెంగళూరు నగరంలో ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకోంది. మహిళ మీద సామూహిక అత్యాచారం చెయ్యడంతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది.
బెంగళూరు నగరంలోని భారతీనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జనప్రదేశంలో 34 ఏళ్ల మహిళ అపస్మారకస్థితిలో పడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలి మీద సామూహిక అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలల్లో వెలుగు చూసింది. సామూహిక అత్యాచారం జరగడంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. ఆమె కోమాలో ఉందని, పేరు, పూర్తి వివరాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మహిళ పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఆమె కోలుకుంటేనే అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications