Lata Mangeshkar: 14 టన్నుల బరువున్న 40 ఫీట్ల వీణ.. ఎక్కడ ఉందో తెలుసా..
బాలీవుడ్ ప్రముఖ సింగర్ లతామంగేష్కర్ కు యూపీ సర్కార్ ఘనంగా నివాళి అర్పించింది. లతామంగేష్కర్ కు గుర్తుగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లతామంగేష్కర్ చౌక్ దగ్గర 14 టన్నుల బరువున్న 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్ గా ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.నగరంలోని రామ్ కథా పార్క్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దేశంలోనే ఇంత పెద్ద సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అక్కడి అధికారులు చెబుతున్నారు. 1929లో లతా మంగేష్కర్ జన్మించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన ఆమె ముంబైలో మరణించారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ వీణను దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారు, దీని తయారీకి రెండు నెలల సమయం పట్టింది.