వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: పెళ్లి చేసుకుందామని చెప్పాడు.. వెళ్లగానే నరికేశాడు..

|
Google Oneindia TeluguNews

ప్రేమించానని నమ్మబలికాడు.. కన్నవాళ్లకు దూరం చేశాడు.. తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. లుథియానా జిల్లాకు చెందిన జస్విందర్​ కౌర్​, పరంప్రీత్ ప్రేమించుకున్నారు. పరంప్రీత్ జస్విందర్ మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. మీ వాళ్లకు చెబితే ఒప్పుకోరు. మనం ఇంటి నుంచి వెళ్లి పోయి వివాహం చేసుకుందామని చెప్పాడు.

15 రోజుల క్రితం

15 రోజుల క్రితం


ఇది నమ్మిన కౌర్ 15 రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా కొంత డబ్బు, బంగారం తీసుకుని పరంప్రీత్ తో కలిసి పారిపోయింది. కౌర్ వద్ద డబ్బు బంగారం తీసుకున్న పరంప్రీత్ కౌర్ ను తన నలుగురి స్నేహితులతో కలిసి హత్య చేశాడు. గొడ్డలితో నరికి కాలువలో పడేశారు. పోలీసులకు దొరక్కూడదని ఆ శవాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. పెట్రోల్ పోసి తగులపెట్టారు. అయినా పూర్తిగా కాలకపోవడంతో ఖాళీ స్థలంలో పాతి పెట్టారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

జస్విందర్ కౌర్ ఇంటి నుంచి వెళ్లిన మరుసటి రోజు ఆమె సోదరుడు కౌర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జస్విందర్ కౌర్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు.
ఆ కాల్ లిస్ట్ లో పరంప్రీత్ తో ఎక్కువగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

జస్విందర్ కౌర్

జస్విందర్ కౌర్

అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా జస్విందర్ కౌర్ తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పరంప్రీత్ తో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, సెల్ ఫోన్లు స్వాధీనం చేశారు. డబ్బు కోసం కౌర్ ను ప్రేమించినట్లు నటకమాడినట్లు పరంప్రీత్ చెప్పాడు.

English summary
He said he loved. He took him from home and killed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X