కాంగ్రెస్ సమావేశంపై కాల్పులు: కుర్చీల కింద దాక్కున్నారు
ఇంఫ్లాల్: మణిపూర్ రాష్ట్రంలో కొంతమేర శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఏదో ఒక మూలన ఉద్రిక్త పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అయితే, మణిపూర్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రచార సభ జరుగుతుండగా కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో సభకు హాజరైన వారంతా కుర్చీల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ సభలే లక్ష్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది మూడో ఘటన అని తెలిపారు. కాల్పులు ఎన్ఎస్సీఎన్-ఐఎం పనేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేగాక, ఎన్నికల సంఘం అధికారులు ఇలాంటి ఘటనలపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
The repeated disruption of the MP (Outer Manipur) election campaign by the suspected NSCN-IM is a grave concern for democratic integrity. @INCIndia's campaign, thwarted for the third time, underscores the urgent need for @ECISVEEP to take decisive action. Without swift… pic.twitter.com/u8W8VKVQoK
— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) March 21, 2024
ఇది ఇలావుండగా, ఉఖ్రుల్ జిల్లాలో గత మంగళవారం మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) బహిరంగ సభ సందర్భంగా సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. మంగళవారం కాంగ్రెస్ భవన్లో ఎంపీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర మాట్లాడుతూ.. ఉఖ్రుల్ జిల్లా (ఔటర్ మణిపూర్ నియోజకవర్గం) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న ఆల్ఫ్రెడ్ కన్ంగమ్ ఆర్థర్పై చింగై అసెంబ్లీ నియోజకవర్గంలోని టీనెమ్ గ్రామంలో జరిగిన సమావేశంలో సాయుధ దుండగులు దాడి చేశారని తెలిపారు.
ఉఖ్రుల్లోని పవోరీ షిరుయ్ గ్రామంలోని టికె ఉడ్ల్యాండ్ రిసార్ట్లో మాజీ ఎమ్మెల్యే ఆల్ఫ్రెడ్పై సోమవారం కూడా సాయుధ దుండగులు దాడి చేశారు. దాడుల అనంతరం ఉఖ్రుల్ జిల్లా ఔటర్ నియోజకవర్గం అభ్యర్థికి భద్రతా చర్యలు చేపట్టాలని మణిపూర్ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీసీసీ కోరింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications