‘మద్యం తాగి వాహనం నడిపేవారు.. ఆత్మాహుతి బాంబర్లే’
న్యూఢిల్లీ: మద్యం సేవించి వాహనం నడిపేవారు ఆత్మాహుతి బాంబర్లాంటివారే అని ఢిల్లీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన ఢిల్లీకి చెందిన ఓ ఆటోడ్రైవర్కు కోర్టు 20 రోజుల జైలుశిక్ష విధించింది.
తాను మొదటిసారి తప్పు చేశానని పేర్కొంటూ.. జైలుశిక్షను రద్దు చేయాలని కోరుతూ అడిషనల్ సెషన్స్కోర్టును సదరు ఆటోడ్రైవర్ ఆశ్రయించాడు. ఈ కేసును మంగళవారం విచారించిన జడ్జి వీరేందర్ భట్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. రద్దీ ఉండే సమయంలో మద్యం తాగి వాహనం నడుపడం తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు.

కాగా, రాష్ డ్రైవింగ్ చేస్తూ శిక్షలకు గురైన వారు తమ సంపదను, అధికారాన్ని ఉపయోగించి తమకు పడిన శిక్షలను తక్కువగా చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications