మహారాష్ట్ర సీఎం నువ్వానేనా, తెరమీదకు కొత్త పేరు, గవర్నర్ కు మనవి, నేనే కరెక్ట్ !
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కోసం బీజేపీ, శివసేన పార్టీలు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్న సమయంలో ఆ పదవి రేసులోకి మరో వ్యక్తి వచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించి మహారాష్ట్రను మరింత అభివృద్ది చెయ్యడానికి తనకు అవకాశం ఇవ్వాలని శ్రీకాంత్ విష్ణు మనవి చేశారు.

మంచి రైతు
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్కౌలి ప్రాంతంలో శ్రీకాంత్ విష్ణు నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ విష్ణు రైతు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి శ్రీకాంత్ లేఖ రాశారు. తాను మంచి రైతుగా గుర్తింపు తెచ్చుకున్నానని శ్రీకాంత్ విష్ణు గవర్నర్ కు రాసిన లేఖలో వివరించారు.

ఒకేఒక్క చాన్స్ !
బీజేపీ, శివసేన నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత వరకూ, సీఎం కుర్చీ ఎవ్వరికి ఇవ్వాలి అనే విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకూ తనను ముఖ్యమంత్రిని చెయ్యాలని శ్రీకాంత్ విష్ణు గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి మనవి చేశారు.

రైతుల సమస్యలు
తాను ఓ రైతు, రైతుల సమస్యలు ఏలా ఉంటాయో తనకు బాగా తెలుసు అని శ్రీకాంత్ విష్ణు అంటున్నారు. రైతుల సమస్యలు అన్నీ పరిష్కరించాలంలే తనను ముఖ్యమంత్రి చెయ్యాలని శ్రీకాంత్ విష్ణు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి మనవి చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు !
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2019 అక్టోబర్ 21వ తేదీ జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24వ తేదీ ప్రకటించారు. 105 స్థానాల్లో బీజేపీ, 56 స్థానాల్లో శివసేన పార్టీ విజయం సాధించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే మ్యాజిక్ ఫిగర్ 145.

కొత్త సమస్య !
మహారాష్ట్రలో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీ అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. శివసేన మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయితే శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం 50.50 ఫ్మార్ములా తెరమీదకు తీసుకురావడంతో కొత్త సమస్య ఎదురైయ్యింది. సీఎం కుర్చీ కోసం బీజేపీ, శివసేన నువ్వానేనా అని పోటీ పడుతుంటే ఇప్పుడు శ్రీకాంత్ విష్ణు తెరమీదకు వచ్చారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications