లలిత్ మోడీ మెడకు రెడ్ కార్నర్ నోటీసు ఉచ్చు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మెదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతనిని అరెస్టు చెయ్యడానికి ఈడీ అన్ని కోణాలు పరిశీలిస్తున్నది. లలిత్ మోదీ ఈడీ నుండి తప్పించుకోలేరని అధికారులు అంటున్నారు. ఈ స్థితిలోనే లలిత్ మోడీని భారత్ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ నుండి బహిష్కరణకు గురైన లలిత్ మోడీ తప్పించుకుని తిరుగుతున్నాడు. లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీని భారత్ రప్పించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రయత్నిస్తున్నారు.
లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చెయ్యాలని ఈడీ సీబీఐ అధికారులను కోరింది. ఈ విషయంపై సీబీఐ అధికారులు ఇంటర్ పోల్ ను సంప్రదిస్తున్నారు. త్వరలో లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

మనీలాండరింగ్ కేసులో ఇటివల ప్రత్యేక కోర్టు లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీ మీద ఈడీ కేసులు నమోదు చెయ్యడంతో అతను 2012 లో లండన్ పారిపోయాడు.
అప్పటి నుండి భారత్ కు తిరిగిరాలేదు. ఈడీ అధికారుల దర్యాప్తుకు సహకరించలేదు. తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పలు ట్విట్ లు చేసి వారిని ఇరకాటంలో పెట్టాడు. లలిత్ మోడీ అరెస్టు అయితే ఎంత మంది నాయకుల బండారం బయటపడుతుందో వేచి చూడాలి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications