మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన వెలుగుచూసింది. కాగ గర్భం దాల్చిన విద్యార్థిని ఎనిమిదవ తరగతి చదువుతోంది. విద్యార్థిని గర్భం దాల్చిన విషయం తెలిసిన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు పిర్యాధు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అందుకు కారణమైన అముల్యా ప్రధాన్ అనే యువకున్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం బెల్ఘర్ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో సంబంధిత హస్టల్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు పలు పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థిని నాలుగు నెలల గర్భవతిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హస్టల్ ప్రధాన ఉపాధ్యాయుడు పోలీసులకు పిర్యాధు చేయడంతో వారు విచారణ జరిపి నిందితున్ని అరెస్ట్ చేశారు.
కొద్ది రోజుల క్రితమే ఒరిస్సాలోని మారుప్రాంతాల వసతి గృహాల్లో విద్యార్థులు గర్భం దాల్చుతున్న సంఘటనలు జరిగాయి....దీంతో వెసవి సెలవుల తర్వాత స్కూళ్లోకి చేరిన విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఖుర్థ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు..దీంతో పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందికి షాక్ తగిలింది..భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్న రెండు వసతి గృహాల్లో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు తెలిపారు..దీంతో విషయాన్ని తెలుసుకున్న జిల్లా మహిళ సంక్షేమ కమిటి వెంటనే స్పందించి పోలీసు కమిషనర్కు సైతం పిర్యాధు చేశారు. ఇక ఆ సంఘటన అనంతరమే మరో విద్యార్థి గర్భం దాల్చడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.