Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !
పాట్నా/బీహార్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య లొల్లి మొదలైయ్యింది. దంపతుల మధ్య చిన్నచిన్న మొదలైన గొడవలు రానురాను పెద్దవి అయ్యాయి. దంపతులకు ఇరువైపుల కుటుంబ సభ్యులు నచ్చ చెబుతూ వచ్చారు. అయితే దంపతులు మాత్రం పాము, ముంగిసాలా పోట్లాడుకుంటున్నారు. భార్య తీరుతో విసిగిపోయిన భర్త అతని ప్రైవేట్ పార్ట్. బాహ్య జనాంగాలు కోసిపారేయడం కలకలం రేపింది. భార్య మీద కోపంతో భర్త చేసిన పనికి అందరూ హడలిపోయారు.
Reddy: గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పోటీ చేస్తున్న నియోజక వర్గాలు ఇవే, వార్ వన్ సైడ్ ? లేక ?
దంపతుల కాపురం
బీహార్ లో కొన్నికొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. బీహార్ లోని మాధేపూరా జిల్లాలోని మురళిగంజ్ సమీపంలోని నయానగర్ గావ్ గ్రామంలో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళను సూరజ్ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్న సూరజ్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
ముగ్గురు కూతుర్లు, ఓ కొడుకు
సూరజ్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రానురాను దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. పెద్దలు జోక్యం చేసుకుని దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వస్తున్నారు. అయితే సూరజ్ భార్య ఎవ్వరి మాట వినడం లేదని ఆరోపణలు ఉన్నాయి. సూరజ్ అతని భార్యతో సర్దుకుని పోతున్నాడని తెలిసింది.
పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
వారం రోజుల నుంచి సూరజ్ కు అతని భార్యకు గొడవలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల వాళ్లకూడా వీరి తీరుతో విసిగిపోయి పట్టించుకోవడం మానేశారని తెలిసింది. శుక్రవారం గొడవ పెద్దది కావడంతో తాను పుట్టింటికి వెళ్లిపోతానని సూరజ్ భార్య రెఢీ అయ్యింది. ఆ సందర్బంలో పుట్టింటికి వెళ్లకూడదని సూరజ్ అతని భార్యకు మనవి చేశాడని తెలిసింది. అయితే నలుగురు పిల్లలను పిలుచుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
తిక్కలోడు.....మర్మాంగం కోసిపారేశాడు
భార్య తీరుతో విసిగిపోయిన సూరజ్ ఆమె మీద పగతో రగిలిపోయాడు. తిక్కలోడు భార్య మీద పగ తీర్చుకోకుండా అతని మీద అతనే పగ తీర్చుకున్నాడు. పదునైన కత్తి తీసుకున్న సూరజ్ అతని ప్రైవేట్ పార్ట్ తో పాటు బాహ్య జనాంగాలు కోసుకున్నాడు. నొప్పి తట్టుకోలేక సూరజ్ కేకలు వేశాడు. చుట్టుపక్కన నివాసం ఉంటున్న బంధువులు వెళ్లి చూస్తే సూరజ్ రక్తపు మడుగులో పడిఉన్నాడు.
ఎంత పనిచేశావురా మూర్ఖుడా
ఏం జరిగిందని బంధువులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేపరిస్థితిలో అతను లేడు. వెంటనే బంధువులు సూరజ్ ను మాధేపురా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. సూరజ్ అతని ప్రైవేట్ పార్ట్ ను కోసుకున్నాడని, అతనికి చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్య పరిస్థితి కుదటపడుతోందని శనివారం మెడికల్ కాలేజ్ కు చెందిన వైద్యుడు స్థానిక మీడియాకు చెప్పారు.
ఇలాంటి మెంటల్ మొగుళ్లు ఉన్నంతకాలం ?
భార్య మీద కోపంతో భర్త అతని ప్రైవేట్ పార్ట్ అతనే స్వయంగా కోసుకున్నాడని మాధేపురా జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు. మొత్తం మీద భార్య మీద పగతో ప్రైవేట్ పార్ట్ కోసుకున్న భర్త ఇప్పుడు సంసారానికి పనికిరాకుండా పోవడం బీహార్ లో కలకలం రేపింది. ఇలాంటి మెంట్ మొగుళ్లు ఉన్నంత వరకు కొంత మంది భార్యలు వాళ్లు ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారౌతుందని బాధితుడి బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.