Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Thrissur రైల్వే స్టేషన్ పార్కింగ్ లో భారీ అగ్నిప్రమాదం- 200+ వాహనాలు భస్మీపటలం.. !!

కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పక్కన జరిగిన ఈ ఘటనలో 200లకు పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్, ఇంధన లీకేజీ లేదా ఇతర కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తసుకొచ్చారు. రోజువారీ 500కు పైగా బైక్‌లను నిలిపివుంచే సామర్థ్యం ఉందీ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో. ఇక్కడ పార్క్ చేసి ఉంచిన వాహనాలు పూర్తిగా ధ్వంసమై ఉండవచ్చని అంచనా. మంటల వల్ల పలు వాహనాల పెట్రోల్ ట్యాంకులు పగిలాయి. అందులోని పెట్రోల్ ఎగజిమ్మడం వల్ల మంటలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

A major fire broke out at the Thrissur Railway Station gutted Over 200 Vehicles

రైల్వే పార్కింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే అగ్ని పెద్దఎత్తున వ్యాపించడానికి కారణమని భావిస్తోన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, తొలుత ఒకే బైక్‌ నుంచి తేలికపాటి మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో అగ్నిమాపక పరికరం అందుబాటులో ఉండి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్రంగా మారేది కాదని చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు నిమిషాల్లోనే ఇతర వాహనాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటన ప్రయాణికులు, సమీప నివాసితులలో భయాందోళనలు రేకెత్తించింది.

మంటలు ఆరిపోయినప్పటికీ, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వాహన యజమానులు సంఘటనస్థలానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది రోజువారీ ప్రయాణికులే. తమ వాహనాలు కాలి బూడిదవ్వడం చూసి ఆవేదన చెందారు.

ప్రమాదంలో ధ్వంసమైన వాహనాల ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ప్రస్తుతానికి అంతుబట్టలేదు. ఈ విచారణలో రైల్వే స్టేషన్ పరిసరాల సీసీటీవీ ఫుటేజీ కీలకం కానుంది. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు ధృవీకరించారు. పార్కింగ్ ప్రాంతం గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలో ఉంది. సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా మంటలు రైల్వే మౌలిక సదుపాయాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+