భార్యను చంపాను దయచేసి వచ్చి అరెస్ట్ చేయండి...!
తన మేనల్లుడి పెళ్లికి వెళ్లేందుకు నిరాకరించడంతో పాటు భార్యతో తరచు ఘర్షణ పడే వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.. రెండెళ్ల చిన్నారీ పక్కన నిద్రపోతుండానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య ముఖానికి కట్టుకునే స్కార్ఫ్తోనే గోంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తాను పోలీసు స్టేషన్కు రాలేకపోతున్నానని,తన కొడుకు నిద్రపోతున్నాడంటూ... దయచేసి ఇంటికి వచ్చి తనను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
మహారాష్ట్రాలోని అంబర్ నాథ్ ప్రాంతంలో దీపక్ శుక్ల తన భార్యతో తరచూ గొడవ పడుతుండే వాడు. అకారణంగా నిందించడంతోపాటు ఇబ్బందులకు గురి చేసే మనస్థత్వం కల్గినవాడు.ఈ నేపథ్యంలోనే తన మేనళ్లుడి పెళ్లి అయింది. అయితే ఆ పెళ్లికి వెళ్లేందుకు భార్య రూపాలి నిరాకరించింది. ఆ కారణంతో భార్యపై కక్ష పెంచుకున్న దీపక్ శుక్ల ఆమేను అకారణంగా కోట్టాడు. అనంతరం ఆమే కట్టుకునే స్కార్ఫ్తో ఉరివేసి చంపివేశాడు.
కాగా దీపక్ శుక్లా దంపతులకు తోమ్మిదేళ్ల కూతురుతో పాటు, రెండళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా దీపక్ శుక్లా భార్యను చంపుతున్న సంధర్భంలో తన రెండు సంవత్సరాల కుమారుడు నిద్రపోతుండగా కూతురు స్కూలుకు వెళ్లింది. ఇక భార్యను చంపిన శుక్లా స్థానిక శివాజీనగర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి తానే భార్యను చంపానని సమాచారం ఇచ్చాడు. తన కోడుకు నిద్రపోతున్నందువల్ల పోలీస్ స్టేషన్కు రాలేకపోతున్నానని చెప్పాడు. దయచేసి పోలీసులే వచ్చి అరెస్ట్ చేయాలని కోరాడు. దీంతో శుక్లా ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి,శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించినట్టు తెలపారు.