పట్టపగలు ప్రియుడితో లేచిపోయిన పిల్లల తల్లి, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లబోదిబో !
భువనేశ్వర్/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులు పిల్లలతో కలిసి వేరే సిటీకి వెళ్లారు. పని చేస్తూ భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్న భర్తకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. భర్తతో కలిసి పని చేస్తున్న పెళ్లికాని యువకుడితో కలిసి పిల్లల తల్లి పారిపోవడంతో కలకలం రేపింది.
జార్ఖండ్లోని మహేశ్పూర్ గ్రామానికి చెందిన నజీబుల్ షేక్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం సహీనా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. నజీబుల్, సహీనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జార్ఖండ్ లో పని చెయ్యడానికి సరైన ఉపాది పనులు లేకపోవడంతో కొన్ని నెలల క్రితం నజీబుల్ అతని భార్య సహీనా, ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం చెన్నై చేరుకున్నాడు.

భవన నిర్మాణ పనులు చేసుకునేందుకు చెన్నైకి వచ్చిన నజీబుల్ షేక్ అతని భార్య సహినా కలిసి చెన్నై పక్కనే ఉన్న మెదవాక్లోని ఓ నిర్మాణ స్థలంలో ఉంటూ అదే భవనంలో పనిచేస్తున్నారు. ఇదే భవనంలో ఒడిశాకు చెందిన సితార్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రతిరోజు నజీబుల్, సితార్ కలిసి అక్కడ మేస్త్రీలుగా పని చేస్తున్నారు.

ఇదే సమయంలో భర్త నజీబుల్ తో కలసి పని చేస్తున్న సితార్ ను సహీనా పరిచయం చేసుకుంది. రానురాను సహీనా, సితార్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంకా పెళ్లికాని సితార్ కు పాలకోవా తినిపిపంచిన సహీనా అతన్ని వలలో వేసుకుంది. కొద్దిరోజుల్లోనే సితార్, సహీనాల వివాహేతర బంధం బలంగా మారిందని తెలిసింది.
ఈ క్రమంలో భవనంలో పని చెయ్యడానికి వెళ్లిన నజీబుల్ షేక్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పిల్లలు మాత్రమే ఉండటం చూసి హడలిపోయాడు. భార్య సహీనా కనిపించడం లేదని తేలిసి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన నజీబుల్ తెలిసినవ వాళ్లు, సాటి కూలీలను అతని భార్య గురించి అడిగాడు.
ఆ తర్వాత ఇరుగుపొరుగు వారిని విచారించి భార్య సహీనా కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త నజీబుల్ హడలిపోయాడు. భర్త నజీబుల్ తో కలిసి పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సితార్ కూడా కనిపించకుండా పోయాడని తేలింది. భార్య సహీనాపై అనుమానం వచ్చిన నజీబుల్ షేక్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పల్లికరణై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఒడిశాకు చెందిన సితార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి పారిపోయిన నా భార్య సహీనాను తిరిగి రప్పించాలని నజీబుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనవి చేశాడు. ఫిర్యాదు చూసిన పోలీసులకు ఫిర్యాదుదారుడు అయిన భర్త నజీబుల్, తల్లిలేని ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయారు.

అయితే నజీబుల్ దగ్గర అతని భార్య సహీనా ఫోటో మాత్రమే ఉండటం, ప్రియుడు సితార్ ఫోటో లేకపోవడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తనతో స్నేహంగా ఉంటూ తన కొంప ముంచిన సితార్ చిక్కితే అతని మీద కఠిన చర్చలు తీసుకోవాలని సహీనా భర్త నజీబుల్ షేక్ విలపిస్తున్నాడని, కేసు విచారణలో ఉందని చెన్నై పోలీసు అధికారులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications