మాస్ కాపియింగ్ అంటే ఇదీ... ఒకే సమాధానాన్ని రాసిన 959 విద్యార్థులు...!
మాస్ కాపియింగ్ అనేది నేటి రోజుల్లో కామన్గా మారిందా...? విద్యా వ్వవస్థలో అనేక మార్పులు వస్తున్నా.. యజమాన్యాలు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదా...? అంటే అవుననే సమాధానం వస్తుంది. విద్యార్థుల వద్ద వేల రుపాయల ఫీజులు తీసుకుని ,వారు చదువుకునేందుకు కళాశాలలకు వచ్చినా, రాకున్నా పాస్ చేయించే విద్యా వ్యవస్థ ప్రస్థుతం కోన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్స్పై కనీస అవగాహన లేకున్నా, ఉన్నది ఉన్నట్టు వ్రాస్తున్న సంఘటనలు పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.

959మంది ఓకే సమాధానం
ఈనేపథ్యలోనే గుజరాత్కు చెందిన 959 మంది విద్యార్థులు ఓకే సమాధానం రాసి బుక్కయ్యారు. సమాధానాలతోపాటు మాస్ కాపియింగ్ చేసిన తప్పులే అందరు చేశారు. ఇక 200 మంది విద్యార్థులు ఓకే వ్యాసం రాసి, మక్కికి మక్కి దించిన ఘటన జూనాఘడ్ మరియు గిర్ సోమ్నాథ్ జిల్లాలోని ఓ ఎగ్జామినేషన్ సెంటర్లో జరిగింది.ఇక మాస్ కాపీయింగ్ అంతా కూడ ఎకనామిక్స్,ఇంగ్లీష్,తోపాటు స్టాటిటిక్స్ సబ్జెక్ట్స్లో కొనసాగింది.

సంవత్సరంలో రెండు వారాలే కాలేజీ చదువులు
ఇటివల గుజరాత్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షల్లో మాస్ కాపియింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో మాస్ కాపియింగ్ పై పలు విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 959 మంది ఓకే సమాధానాన్ని రాసి బుక్కయ్యారు. అయితే వీరంతా సెల్ఫ్ఫైనాన్స్ విద్యార్థులుగా తేలారు. కాగా వీరిలో కొంతమంది మాత్రం పరీక్ష సెంటర్లో టీచర్ డిక్టేట్ చేస్తుంటే రాశామని తెలిపారు.

సంవత్సరం పాటు విద్యార్థుల విత్హెల్డ్..
దీంతో మాస్ కాపియింగ్ పాల్పడిన విద్యార్థులను అందరిని 2020 వరకు విత్హెల్డ్లో పెట్టారు అధికారులు. మరోవైపు పరీక్షలే రద్దు ఆలోచనలో ఉన్నట్టు అక్కడి అధికారులు వెళ్లడించారు.అయితే ప్రతి విద్యార్థి రూ.35000 వేల రూపాయాలు చెల్లించి రెగ్యులర్ విద్యార్థుల కోనసాగుతున్నారు. వీరంతా సంవత్సరంలో రెండు వారాలు మాత్రమే క్లాసులకు వెళతామని కొంతమంది విద్యార్థులు తెలిపారు.












Click it and Unblock the Notifications