Air India: విమానంలో సిబ్బందిపై దాడికి ప్రయాణికుడి యత్నం.. కేసు నమోదు..
గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉంది.. విమానాన్ని మళ్లించాలని బెదిరించిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసకుంది. ఓ వ్యక్తి విమానంలో వికృతంగా ప్రవర్తించాడు. మంగళవారం టొరంటో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఎయిర్ ఇండియా ఓ వ్యక్తి సిబ్బందిని దుర్భాషలాడడంతో లావెటరీ డోర్ను పగులగొట్టాడు. దీంతో నేపాల్ కు చెందిన అతడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
అతడి పేరు మహేష్ పండిట్గా గుర్తించారు. మహేష్ విమానంలో సీటును మార్చుకున్నాడు. దీంతో గొడవ ప్రారంభం అయింది. అతనికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆగిపోయాడని బాధిత క్యాబిన్ సూపర్వైజర్ ఆదిత్య కుమార్ తెలిపారు. అయితే, కొంతసేపటి తర్వాత అతను లావేటరీ స్మోక్ చేశాడని చెప్పాడు. అంతే కాదు తర్వాత ప్రయాణీకుడు లావేటరీ డోర్లు పగలగొట్టాడని చెప్పాడు. మరో 10 మంది ప్రయాణికుల సాయంతో నిందితుడైన ప్రయాణికుడిని అదుపు చేయగలిగామని తెలిపారు.

"నేను ప్రయాణికుడి ముందు తలుపు తెరిచినప్పుడు, అతను నన్ను వెనక్కి నెట్టి తన సీటు 26F వద్దకు పరిగెత్తాడు. నేను అతనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతను నన్ను నెట్టివేసి, నన్ను కూడా దుర్భాషలాడాడు. తర్వాత, అతను LAV డోర్ 3F-RCని పగలగొట్టాడు. అప్పుడు నేను వెంటనే కెప్టెన్కి సమాచారం ఇచ్చాను. అతని సూచన మేరకు - క్యాబిన్ సిబ్బంది పునీత్ శర్మ, ఇతర నలుగురు ప్రయాణీకుల సహాయంతో - మేము SOP ప్రకారం అతన్ని నిరోధించడానికి ప్రయత్నించాము "అని కుమార్ పోలీసులకు చెప్పినట్లు ANI నివేదించింది.
నిందితుడు ప్రయాణికులను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మాకు తర్వాత తెలిసిందన్నారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిపై సెక్షన్లు 323/506/336 ఇండియన్ పీనల్ కోడ్ మరియు 22,23,25 ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ కింద IGI పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా, ప్రయాణికులు మూత్ర విసర్జన చేయడం లేదా విమానంలో దురుసుగా ప్రవర్తించడం వంటి అనేక సంఘటనలు జరిగాయి. శంకర్ మిశ్రా గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఓ వృద్ధురాలిపై తాగిన మత్తులో మూత్ర విసర్జన చేశాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications