Borewell: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..
బీహార్లోని నలందాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శివమ్ అనే బాలుడిని రక్షించడానికి NDRF, ఇతర రెస్క్యూ బృందాలు బోరుకు సమాంతరంగా తవ్వకాలు చేపట్టాయి. "ఒక బాలుడు బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. మేము చిన్నారిని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. NDRF, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. పిల్లవాడు ఇంకా బతికే ఉన్నాడు. మేము అతని గొంతును వినగలము" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బాలుడు 40 నుంచి 50 అడుగుల మధ్యలో ఇరుక్కున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలుడి తల్లి పొలం వద్ద పని చేస్తుండగా బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తాము వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఓ రైతు బోరు వేశాడని.. అందులో నీరు రాకపోవడంతో బోరును పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది.

చిన్నారిని బయటకు తీస్తే తక్షణ వైద్య సహాయం అందించడానికి ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు కూడా ఉన్నాయని ఓ అధఇకారి చెప్పారు. "ఈ బోర్వెల్ను ఇక్కడి రైతు బోరింగ్ కోసం తయారు చేశాడు. కానీ ఇక్కడ బోరింగ్ విజయవంతం కాలేదు, కాబట్టి వారు మరొక ప్రదేశంలో బోరింగ్ ప్రారంభించారు మరియు ఈ బోర్వెల్ మూసివేయబడలేదు" అని రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారిఐ తెలిపారు.
చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఘటన గురించి తెలుసుకున్న పలువురు సీనియర్ పోలీసు అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడంది. ఆమెను బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.












Click it and Unblock the Notifications