స్మగ్లింగ్: ఎయిర్ ఇండియా పైలెట్ అరెస్టు
ముంబై: ఎయిర్ ఇండియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్ పైలెట్ బంగారం స్మగ్లింగ్ చూస్తు అడ్డంగా బుక్కయ్యాడు. అతని దగ్గర ఉన్న బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్న ముంబై కస్టమ్స అధికారులు కేసు నమోదు చేశారు. తరువాత ఆ పైలెట్ ను బెయిల్ మీద విడుదల చేశారు.
బుధవారం రాత్రి ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న సీనియర్ పైలెట్ ఒకరిని ముంబై విమానాశ్రంలో కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. ఆయన దగ్గర రూ. 16 లక్షల విలువైన 600 గ్రాముల 7 బంగారు కడ్డీలు ఉన్న విషయం గుర్తించారు. ఏమిటని ఆ పైలెట్ ను ప్రశ్నించారు.

తాను స్మగ్లింగ్ చేశానని ఆ పైలెట్ అంగీకరించాడు. వెంటనే ఎయిర్ ఇండియా ఇంటిలిజెన్స్ విభాగానికి సమాచారం ఇచ్చారు. తరువాత ఆ పైలెట్ మీద కేసు నమోదు చేసి అనంతరం బెయిల్ మీద విడుదల చేశామని ముంబై విమానాశ్రయ అధికారులు చెప్పారు.
సాధారణంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికులతో పాటు పైలెట్లు, సిబ్బందిని చెక్ చేస్తామని, అందులో భాగంగా పైలెట్ ను చెక్ చెయ్యగా విషయం వెలుగు చూసిందని అధికారులు చెప్పారు. పైలెట్ పేరు చెప్పడానికి ఎయిర్ ఇండియా అధికారులు నిరాకరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications