Viral Video: యూపీలో దారుణం.. భార్యను స్తంభానికి కట్టేసి చితకబాదిన భర్త..
ఓ వ్యక్తి తన భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన యూపీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను కరెంటు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు. ఆమెను కొట్టేటప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

22 సెకన్ల వీడియో..
22 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిందితుడిని శాయంబిహారిగా గుర్తించారు. ఈ సంఘటన జూలై 14న జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సేనా గ్రామంలో జరిగింది. వీడియోలో శాయంబిహారి తన భార్య కుసుమా దేవిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టడం చూడవచ్చు. తర్వాత ఆమెను లాక్కెల్లాడు.
పరారీలో నిందితులు..
పోలీసులు అదే రోజు నిందితుడు, అతని తల్లి బర్ఫా దేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ పరారీలో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియా సైట్లలో కనిపించింది" అని సికంద్రా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ షాహి PTI కి తెలిపారు.

కేసు నమోదు..
శ్యాంబిహారి, అతని తల్లిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 342 (తప్పుగా నిర్బంధించడం) మరియు 354 (మహిళల అణకువను దెబ్బతీయడం) కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications