Rahul Gandhi: రాహుల్ మీరు మారిపోయారు.. వైరల్ అయిన వీడియో..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సామాన్యులతో కలిసి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల విలాస్పూర్ నుంచి రాయ్పూర్కు రెండు గంటలపాటు రైలు ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన 13 నిమిషాల వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక వైపు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి తన ఆట గురించి చర్చిస్తుండగా, మరోవైపు ఒక కళాకారుని కుల వివక్షపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఎక్కడో ఒక చోట అమ్మాయిల బృందం పాట పాడుతోంది.
వీరందిరితో రాహుల్ గాంధీ ముచ్చటించారు. కోట్లాది మంది ప్రజలను వారి గమ్యస్థానా లకు చేరవేస్తూ, దేశంలోని వైవిధ్యాన్ని చూపుతూ, భారతీయ రైల్వేలు నిజంగా భారతదేశానికి ప్రతిబింబం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో ప్రచారం, దేశాన్ని ఏకం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాహుల్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ గతంలో సెప్టెంబర్ 25న తన ఛత్తీస్గఢ్ పర్యటన వీడియోను షేర్ చేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా ఉన్నారు.

'దేశంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ కోట్లాది మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న భారతీయ రైల్వే నిజంగా భారతదేశానికి ప్రతిబింబం. రైల్వేలు భారతదేశానికి జీవనాడి, ఇందులో ప్రతిరోజూ కోటి మంది ప్రయాణిస్తున్నారు. రైళ్లలో మాత్రమే నిజమైన భారతదేశ చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ అపరిచితులైనప్పటికీ వివిధ మతాలు, కులాల వారు ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఇందులో రోజుకు కోటి మంది ప్రయాణిస్తున్నారు. రైళ్లలో మాత్రమే నిజమైన భారతదేశ చిత్రం కనిపిస్తుంది" అని రాహుల్ తెలిపారు.
ఈ సమయంలో తాను ఛత్తీస్గఢ్లోని చాలా మంది యువకులతో సంభాషించానని చెప్పారు.'ఈ కాలంలో నాకు దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ అమ్మాయి కూడా పరిచయమైంది. ఆమె కళను చూసి చాలా సంతోషించాను. ఆమె నిజంగా ప్రతిభావంతుడైన కళాకారాలు" అని అన్నారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ మెకానిక్లు, పోర్టర్లు, విద్యార్థులు మరియు కార్పెంటర్లతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో సంభాషించడం కనిపించింది. రాహుల్ గాంధీ ఇటీవల లడఖ్లో పర్యటించారు, అక్కడ కూడా వివిధ సామాజిక వర్గాలతో సంభాషించారు.
जननायक @RahulGandhi जी ने छत्तीसगढ़ में अपने रेल सफर के दौरान युवा टेबल टेनिस खिलाड़ियों से बात की।
— Congress (@INCIndia) October 3, 2023
युवा खिलाड़ियों ने जहां खेल की बेहतर सुविधा के लिए छत्तीसगढ़ सरकार की तारीफ की, तो वहीं टेबल टेनिस को बढ़ावा देने की मांग भी की।
पूरा वीडियो: https://t.co/BKz8wDGajq pic.twitter.com/tE9VIpGuAN
రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం పంజాబ్ లోని అమృత్ సర్ లో పర్యటించారు. సోమవారం గోల్డెన్ టెంపుల్ని సందర్శించారు. అక్కడ తలకు బ్లూ స్కార్ఫ్ ధరించి.. గుర్బానీ కీర్తనను విన్నారు. స్వచ్ఛద సేవలో పాల్గొన్నారు. స్వర్ణ దేవాలయంలో ఇతరులతో కలిసి స్వచ్ఛంద సేవలో భాగంగా పాత్రలు కడిగాడు. రాహుల్ గాంధీలో భారత్ జోడో తర్వాత చాలా మార్పులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications