Viral Video: ఇదేం పనిరా నాయినా.. మీకంటే పశువులే నయం కదా..!
కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా మెలగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఈ వీడియోలో ఓ యువ జంట ట్రైన్ ఎక్కింది.
అందులో అమ్మాయి సీట్ పై కూర్చుంది. అబ్బాయ్ మెకాళ్లపై కూర్చున్నాడు. కోక్ మూత తీసి అతను అమ్మాయి నోట్లో కూల్ డ్రింక్ పోశాడు. ఆ తర్వాత అమ్మాయి ఆ కూల్ డ్రింక్ ను అబ్బాయి నోట్లోకి ఉంచింది. ఆ తర్వాత అబ్బాయి కూడా అమ్మాయి నోట్లోకి ఉంచాడు. అమ్మాయి మళ్లీ అబ్బాయి నోట్లోకి కూల్ డ్రింక్ ను ఉంచింది. అప్పుడు అతను కూల్ డ్రింక్ తాగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Why should I suffer alone!!!#Delhi #Metro pic.twitter.com/LaQnvjhPD3
— X (@MonkwhoguidedSe) October 11, 2023
గత కొన్ని నెలలుగా, మెట్రో రైళ్లలో చిత్రీకరించిన అనేక వీడియోలు, 'రీల్స్' వివాదాస్పద స్వభావం కారణంగా వైరల్ అయ్యాయి. జంట మేకింగ్ నుండి డ్యాన్స్ రీల్స్ వరకు. మెట్రో రైలు లోపల ప్రజలు వీడియోలను రికార్డ్ చేసే సంఘటనలు పెరిగిన తరువాత, DMRC ప్రయాణికులను మెట్రో రైళ్లలో రీల్స్ చేయవద్దని కోరింది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే ఏదైనా కార్యకలాపాలు ఖచ్చితంగా నిషేధించామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications