బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో కంపెనీ 10వ అంతస్తు నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య, ఏం జరిగింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన లేడీ టెక్కీ ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలోని 10వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బుధవారం బెంగళూరులోని కాడుబీసనహళ్ళిలోని సెస్నా బిజనెస్ పార్క్ లోని 10వ అంతస్తు నుంచి కిందకుదూకి గీతాంజలి (27) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

'సత్యభామ'లో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య, 'మిస్ యూ ఆల్' అంటూ మెసేజ్'సత్యభామ'లో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య, 'మిస్ యూ ఆల్' అంటూ మెసేజ్

గోవాకు చెందిన గీతాంజలి బెంగళూరు చేరుకుని సెస్నా బిజనెస్ పార్క్ లోని అలోఫ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. బుధవారం ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లింది. తన సీట్ లో కుర్చొన్న గీతాంజలి కొంత సేపు తన విధులు నిర్వహించింది.

A woman techie committed suicide Cessna Business Park in Bengaluru.

అనంతరం తన కుర్చీలో నుంచి లేచి నేరుగా లీఫ్ట్ దగ్గరకు వెళ్లింది. లిఫ్ట్ లో 10వ అంతస్తు చేరుకున్న గీతాంజలి అక్కడి నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మరణించింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకునిందని కంపెనీ మాజమాన్యం మారతహళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గీతాంజలి వేసుకున్న డ్రస్ లో సూసైడ్ నోట్ లేదని పోలీసులు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గీతాంజలి ల్యాప్ టాప్, బ్యాగ్ పరిశీలిస్తున్నారు. గీతాంజలితో పాటు ఉద్యోగం చేస్తున్న వారిని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
A woman techie committed suicide today(November 22) by jumping from tenth floor of office building at Cessna Business Park, Kadubeesanahalli near Marathahalli, Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X